వసు మీద రిషికి కోపం వచ్చింది.. రీజన్ ఏంటంటే..
on Jun 30, 2022
మంచి నీళ్ల బిందెను తీసుకుని వసు ఇంటికి రావడం చూసి ధరణి "ఏంటిది వసు?" అని అడుగుతుంది. తాగటానికి నీళ్లు లేకపోయేసరికి తెచుకున్నానని చెప్తుంది వసు. ఆ తర్వాత గౌతమ్, రిషి, ధరణి ముగ్గురూ కలిసి "స్కాలర్షిప్ టెస్ట్ లో గెలిచావ్" అంటూ స్వీట్ తినిపిస్తారు. "మీ ఇంటికి ఎండీ గారు వచ్చారు. కాఫీలు, టీలు వంటి మర్యాదలు ఏమీ చేయవా" అంటూ గౌతమ్ కామెడీ చేస్తాడు. "వదినా వసుని నీళ్లు మోయొద్దని చెప్పండి" అంటాడు. ఆ మాటలకు సంతోషంగా ఫీల్ అవుతుంది వసు.
ఇంకో వైపు ఫణీంద్ర.. దేవయానితో కామెడీ చేస్తూ ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి రిషి వాళ్ళు రావడంతో ధరణి మీద కోప్పడుతుంది దేవయాని. ఆ టైంలో రిషి అడ్డుపడి "నేను వదినను తీసుకెళ్లా పెద్దమ్మా" అని చెప్తాడు. అప్పుడు వసు గురించి మాట్లాడతాడు రిషి. దేవయానికి అది నచ్చక గౌతమ్ ని ఇన్డైరెక్ట్ గా తిట్టేసరికి దేవయాని మీద సీరియస్ అవుతాడు రిషి. అంతే.. దేవయాని సైలెంట్ ఐపోతుంది.
మరోవైపు వసు పేరు నోటీసు బోర్డులో వేసేసరికి అందరూ చదివి హ్యాపీగా ఫీల్ అవుతారు. "సన్మాన సభ ఏర్పాట్లను రిషి సర్ దగ్గరుండి చూసుకుంటున్నారు" అని వసుతో చెప్తుంది పుష్ప. వసు చాలా సంతోషిస్తుంది. ఆమె సడెన్ గా కనిపించకుండా పోయేసరికి రిషి వెయిట్ చేస్తుంటాడు. అతడికి సంతోషం కలిగిస్తూ ఫైనల్ గా వసు కనిపిస్తుంది.
అదే టైంలో కమిషనర్ గురించి జగతి, మహేంద్ర మాట్లాడేసరికి వసు వైపు చూస్తూనే సమాధానం చెప్తాడు. ఆ తర్వాత కమీషనర్ ని తప్పకుండా పిలవాలి అంటాడు. జగతి అక్కడి నుంచి వసు దగ్గరకి వెళ్లి మాట్లాడుతుతూ ఉంటుంది. రిషి కూడా వెళ్లిపోతుండేసరికి వసు "ఆగండి సర్" అంటూ అరుస్తుంది. ఐనా వినిపించుకోనట్టే వెళ్ళిపోతాడు. ఇంతలో రిషికి అడ్డు వచ్చి "ఎక్కడికి వెళ్తున్నావ్?" అని అడుగుతాడు మహేంద్ర. "పని ఉంది" అని చెప్పి వెళ్ళిపోతాడు రిషి. ఇక సాక్షి అక్కడికి వచ్చి రిషికి వసుధార ప్రపోజ్ చేసిన వీడియో బయట పెడుతుంది. దాంతో రిషికి వసు మీద బాగా కోపం వస్తుంది. ఇదంతా వసు ప్లాన్ అనుకుంటూ ఉంటాడు. ఎపిసోడ్ లోని మిగతా హైలైట్స్ కోసం ఈ రోజు సాయంత్రం ప్రసారమయ్యే 'గుప్పెడంత మనసు'లో చూడొచ్చు.